Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియోకు పోటీగా ఎయిర్టెల్ 'స్మార్ట్'ఫోన్
- దీపావళి నాటికి రూ.2,500 స్మార్ట్ఫోన్!
- పూర్తిస్థాయి సన్నాహాల్లో ఎయిర్టెల్
- 4 అంగుళాల తెర, రెండు సిమ్లు, రెండు కెమేరాలతో లభ్యం!
న్యూఢిల్లీ: మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోనేందుకు గాను టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇక చౌక ఫోన్ మంత్రం ఎత్తుకోనుంది. రిలయన్స్ జియో తన వినియోగదారు విస్తృతిని మరింతగా పెంచుకునే క్రమంలో రూ.1500లకే 4జీ ఆధారిత మేటి ఫీచర్ఫోన్ను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుకింగ్ ప్రక్రియను పూర్తిచేసుకొని డెలివరీ సన్నాహాలను ప్రారంభించింది. వచ్చే దసరా నవరాత్రుల నుంచి రూ.1,500 ఫోన్లను వినియోగదారులకు అందించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ కూడా ఫోన్ల వార్కు సమాయత్తమైంది. ఇందులో భాగంగా వచ్చే దీపావళి నాటికి రూ.2500లకే 4జీ ఆధారిత స్మార్ట్ఫోన్ను అందించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఫీచర్ల ను బట్టీ వీటి ధరను రూ.2,500-2,700 వరకు నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. జియోకు పోటీగా 4జీ ఫోన్లను అందుబాటులో తెచ్చేందుకు గాను ఎయిర్టెల్ సంస్థ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆకర్షణీయమైన పథకంతో ఈ 4జీ ఫోన్ను తాము అందుబాటులోకి తేనున్నట్టుగా సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీవోఎల్టీఈ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ను యాండ్రాయిడ్ వోఎస్, 1బీబీ రామ్. ఎయిర్టెల్ డ్యూయెల్ సిమ్లు, రెండు వైపుల కెమేరాతో పాటు దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, 4 అంగుళాల తెరతో అందుబాటులోకి తేనున్నట్టుగా సమాచారం.
ఎయిర్టెల్ అతిపెద్ద ముందడుగు..
ముంబయి: రిలయన్స్ జియోకు పోటీనిచ్చే క్రమంలో టెలికాం దిగ్గజం ఎయిర్టల్ సోమవారం అతిపెద్ద అడుగువేసింది. దేశంలో ఇప్పటి వరకు కేవలం రిలయన్స్ జియో సంస్థకే పరిమితమైన 4జీ వీవోఎల్టీఈ టెక్నాలజీని ఎయిర్టెల్ సంస్థ కూడా ప్రారంభించింది. ముంబయిలో తొలిసారిగా ఎయిర్టెల్ ఈ అత్యాధునిక టెలికాం సేవలను ప్రారంభించింది. వచ్చే ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీతో టెలికాం సేవలను అందుబాటులోకి తేనున్నట్టుగా సంస్థ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో టెలికాం సేవలను అందిపుచ్చుకొనేందుకు గాను 4జీ వినియోగదారులు కొత్తగా సిమ్కార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.