Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- '429 ప్లాన్'కు అపరిమిత స్పందన
- మార్కెట్లో వేగంగా విస్తరిస్తాం..
- మూడో స్థానాన్ని చేరడమే లక్ష్యం..: తెలంగాణ సర్కిల్ సీజీఎం అనంతరామ్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
ప్రయివేట సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) అందుబాటులోకి తెచ్చిన పథకాలకు వినియోగదారులు విశేషంగా ఆకర్షితులవుతున్నారని తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంత రామ్ తెలిపారు. ప్రస్తుతం విపణిలో నాలుగో స్థానంలో ఉన్న సంస్థను మూడో స్థానానికి చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా ఆయన వివరించారు. కొత్తగా ఆవిష్కరించిన ప్లాన్-429కు విశేష స్పందన లభిస్తుందని ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతరామ్ మాట్లాడుతూ ఈ కొత్త ప్లాన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కొత్తగా 68వేల మంది ఖాతాదారులు వచ్చారని తెలిపారు. రూ.429 చెల్లించి ఈ ఆఫర్ను పొందడం ద్వారా ప్రతీ రోజు ఉచితంగా 1జీబీ డేటాతో పాటు ఏ నెట్వర్క్కు అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. రోజురోజుకు వినియోగదారుల నుంచి ఈ ప్లాన్కు డిమాండ్ పెరుగుతుందన్నారు. బీఎస్ఎన్ఎల్ 666 ప్లాన్లో రోజుకు 2బీబి డేటా ఉచితంగా అందిస్తున్నామన్నారు.
ఉచిత సిమ్ మేళా..
సెల్ఫోన్ వినియోగదారులను ఆకర్షించడానికి ఉచిత సిమ్ కార్డు మేళా నిర్వహిస్తున్నట్టు అనంతరామ్ తెలిపారు. తెలంగాణ, ఏపీలో ఈ నెల 14వ తేది వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్కు వచ్చే ఫోన్కాల్స్ను 'ఆసీమ్' పథకం ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్న నెంబర్కు మళ్లించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందుకోసం ఏడాదికి కేవలం రూ.99 చెల్లిస్తే చాలని చెప్పారు. 2017 ఆగస్టు ముగింపు నాటికి టీిఎస్, ఎపీలో మొత్తంగా 97,97,472 మంది ప్రీపెయిడ్ ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. క్రితం ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి ఆగస్టు 30 కాలంలో ఇరు రాష్ట్రాల్లో కొత్తగా 7,53,179 వినియోగదారులు నమోదయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 2జి, 3జి సెల్టవర్లు 6,723కు విస్తరించి ఉన్నాయన్నారు. తెలంగాణలో ఈ సంఖ్య 5517గా ఉందని వివరించారు.