Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీమా సంస్థ ఐసీిఐసీఐ లాంబర్డ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19తో ముగియనుందని ఐసీిఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సీిఎఫ్ఓ గోపాల్ బాలచంద్రన్, అండర్ రైటింగ్ క్లెయిమ్స్ చీఫ్ సంజరు దత్తా తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఇష్యూ సెప్టెంబర్ 15న ప్రారంభం అవుతుందన్నారు. ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన 86,247,187 ఈక్వీటీ షేర్లను విడుదల చేయనున్నామని తెలిపారు. ఇందులో 31,761,478 షేర్లను ఐసీిఐసీఐ బ్యాంకు లిమిటెడ్, మరో 54,485,709 షేర్లను ఎఫ్ఎఎల్ కార్పొరేషన్ అమ్మనుందన్నారు. ఇందులో 43,12,359 ఈక్విటీ షేర్లను ఐసీిఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లు కొనుగోలు చేసేందుకు రిజర్వు చేసుకున్నారన్నారు. ఈ ఆఫర్కు ప్రైస్ బ్యాండ్ను ప్రతి ఈక్విటీ షేర్కు రూ.651 నుంచి రూ.661 మధ్య స్థిరీకరించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదిత ఆఫర్కు సంబంధించిన ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టు చేస్తామ న్నారు.