Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అలహాబాద్ బ్యాంక్ మహిళల సాధికారికతకు పెద్దపీట వేస్తూ 'ఆల్ బ్యాంక్ శక్తి' పేరుతో కొత్త సేవింగ్స్ ఉత్పాదనను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బ్యాంకు ఈడీ ఎన్.కె.సాహూ ఈ కొత్త ఉత్పాదనను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు దక్షిణ విభాగం ఫీల్డ్ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్, హైదరాబాద్ జోనల్ హెడ్, బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.కె. సారంగీ, ప్రముఖ సినీ నటి జయప్రదల సమక్షంలో సాహూ కొత్త ఉత్పాదనను ఆవిష్కరించారు. ఈ కొత్త సేవింగ్ బ్యాంకు ఉత్తాదన ద్వారా మహిళలకు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై రాయితీ, లాకర్ సదుపాయంతో పాటు తక్కువ రేటుకే గృహ, విద్యా రుణాలను అందజేయనున్నట్టుగా సాహూ తెలిపారు. ఈ సందర్భంగా వికాస్ కుమార్ మాట్లాడుతూ వ్యాపార విస్తరణపై బ్యాంకు ప్రధానంగా దృష్టి సారిస్తోందని అన్నారు. అలహాబాద్ బ్యాంక్ వినియోగదారులకు మేటి, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తూ వస్తోందని వివరించారు.