Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల దాఖలునకు మరింత గడువు పొడిగించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ప్రభుత్వం శనివారం తేల్చి చెప్పింది. పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్నులకు ఇచ్చిన గడువు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత తొందరగా పన్ను రిటర్నులను దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా కోరారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత కూడా పన్ను రిటర్నుల దాఖలునకు సర్కారు దాదాపు ఆరు నెలల పాటు సమయమిస్తూ వచ్చిందని అన్నారు. రిటర్నుల దాఖలునకు ఇప్పటికే తాము చాలా సదీర్ఘమైన గుడువు కాలాన్ని ఇచ్చినట్టుగా తెలిపారు. ఇకపై దీనిని మరింత పొడిగించే అవకాశమే లేదని వివరించారు. ఈ దిశగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు దాదాపు సెల్ఫ్ అసెస్మెంట్ ఫారమ్గా ఉండే జీఎస్టీఆర్-3బీ దాఖలునకు సర్కారు డిసెంబరు వరుకు గడువునిచ్చింది.