Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్తు వాహనాల తయారీపై దృష్టి
ముంబయి: విద్యుత్తు వాహనాల తయారీ విషయంలో వ్యూహాత్మకంగా సహకరించుకొనేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా, అమెరికా వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్తో జట్టు కట్టింది. అత్యాధునిక వాహనాల తయారీ, అనుసంధాన వాహన ప్రాజెక్టులతో పాటు కార్ల విద్యుదీకరణ అంశాల్లో సహకారానికి గాను రెండు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. రానున్న మూడేండ్ల వరకు పలు అంశాల్లో తాము కలిసి పని చేయాలని నిర్ణయించినట్టుగా రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ఆ తరువాత ఆవశ్యకతను బట్టి తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోనున్నట్టుగా రెండు సంస్థలు తెలిపాయి. ఈ భాగాస్వామ్యం తమ సంస్థ అంతార్జతీయంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి విస్తరించేందుకు దోహదం చేస్తుంది మహీందా బీఎస్ఈ ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతకు ముందు 1995లో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్ట్ సంస్థలు జట్టు కట్టి విడిపోయిన సంగతి తెలిసిందే.