Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్రల్ రిజర్వు పాలసీ సమీక్ష నిర్ణయాలు రానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 32,402 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ 6 పాయింట్లు పడిపోయి 10,147.55 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో రంగాల వారిగా చూస్తే అయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.15 శాతం, రియాల్టీ 0.79శాతం, ఆటో 0.61శాతం, విద్యుత్ 0.41 చొప్పున లాభపడ్డాయి. మరోవైపు లోహా సూచీ 0.58శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.39శాతం, హెల్త్కేర్ 0.34శాతం, కన్జ్యూమర్ డురెబుల్స్ 0.32శాతం చొప్పున నష్టపోయాయి.