Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గూగుల్ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన పేమెంట్ యాప్ తేజ్కు దేశ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ మొబైల్ యాప్ను విడుదల చేసిన 24 గంటల్లోనే దాదాపు 4,10,000 మంది దీనికి సబ్స్క్రయిబై చురుగ్గా వినియోగిస్తున్నారని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ డిజిటల్ దిశగా రూపాంతరం చెందడానికి గూగుల్ రూపొందించిన డిజిటల్ పేమెంట్ మొబైల్ యాప్ 'తేజ్' సహాయపడగలదని గూగుల్ సీఈవో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయి అన్నారు. ట్వీట్టర్ ద్వారా ఆయన తేజ్పై స్పందించారు. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియాను మరో అడుగు ముందుకు తీసుకువెళ్ల డంలో తమ డిజిటల్ చెల్లింపుల మొబైల్ యాప్ దోహదం చేయనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా నోట్ల రద్దు తర్వాత జనవరిలో ఈ డిజిటల్ చెల్లింపుల యాప్పై ఆర్థిక మంత్రితో సుందర్ పిచాయి చర్చలు జరిపినట్టుగా తెలియజేశారు. ఇక ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్ కోసం తేజ్ను ప్రత్యేకంగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ను సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు.