Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులే జీవం
- నిలదొక్కుకొనేలా తగిన ఊతమిస్తాం..
- తొలి దశలో జీఎస్టీ అమలు బేష్: జైట్లీ
ముంబయి: వృద్ధి రేటును తిరిగి గాడిన పెట్టేందుకు గాను ప్రయివేటు పెట్టుబడులను పునరుద్ధరించడం.. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం ప్రధాన సవాళ్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'భారత బ్యాంకుల ఆసోసియేషన'్ (ఐబీఏ) 70వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు పెరిగేలా ప్రోత్సాహక చర్యలు తీసుకోవడంతో పాటు.. వృద్ధికి దన్నుగా నిలిచేలా దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడం తమకు ఇప్పుడున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. తాత్కాలికంగా ప్రతికూలతను ఎదురైనప్పటికీ తిరిగి నిలదొక్కుకొని నిలిచే సత్తా ఆర్థిక వ్యవస్థ సొంతమని జైట్లీ వివరించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిన జైట్లీ సంస్కరణలను ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పంతోనే సర్కారుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల జీవం లాంటివని ఆయన అన్నారు. వాటికి దన్నుగా నిలిచేందుకు అవసరమయ్యే ప్రోత్సాహ చర్యలకు సర్కారు అండగా నిలుస్తుందని ఆయన వివరించారు. నిరర్థక ఆస్తుల నేపథ్యంలో కునారిల్లుతున్న బ్యాంకులు నిలదొక్కుకొ నేందుకు గాను భారీగా మూలధనం అవసరమవుతుందన్న వ్యాఖ్యల నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారీగా పెరిగిన మొండి బాకీలతో పాటు బాసిల్-3 నిబంధనల మేరకు విస్తరించేందుకు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు భారీగా మూలధనం అవసరం.
అనుకున్నదాని కంటే మెరుగ్గా జీఎస్టీ అమలు...
దేశ వ్యాప్తంగా తాజాగా అందుబాటులోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తొలి దశలో అనుకున్నదానికంటే మెరుగ్గా అమలవుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీ నిర్ణయాధికారం విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సహేతుకంగా సంస్థాగతం మేళవింపు ఏర్పడింది ఆయన అన్నారు. రోజువారీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా బలంగా ఉందని ఆయన అన్నారు. కొత్త పన్ను విధానం గురించి స్పష్టత కొరవడిన నేపథ్యంలో.. తయారీదారులు పన్ను భారాన్ని తగ్గించుకొనేందుకు ఉత్పత్తిని తక్కువ చేసి తమ స్టాక్ను పూర్తిగా విక్రయించడంపైనే ఎక్కువగా దృష్టి సారించారని తెలిపారు. ఈ కారణంగానే వృద్ధి రేటు కొంత మందగించిందని ఆయన విశ్లేషించారు. మన ఆర్థిక వ్యవస్థ తిరిగి 7 శాతం వృద్ధిని అందిపుచ్చుకోగలదని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి నగదు ఆధారితంగా సాగే భారత ఆదా, వ్యయాల నమూనాలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు నోట్లరదు ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సర్కారు నిర్ణయాన్ని ఆయన మరోమారు సమర్థించుకున్నారు.