Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,167 పాయింట్ల ఎగువన నమోదు
- వారాంతంలోనూ మార్కెట్లకు లాభాలు
- 250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి వెలుగులు ముందుగానే కనిపిస్తున్నాయి. మెరుగైన సూక్ష్మ గణాంకాల నేపథ్యంలో మదుపరులు శుక్రవారం భారీగా స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపారు. దీనికిి తోడు సానుకూల అంతర్జాతీయ పరిణామాలు కూడా తగిన దన్నునివ్వడంతో మార్కెట్లు కొత్త రికార్డులకు చేరువయ్యాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 71.05 పాయింట్లు పెరిగి 10,167.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ జీవిత కాలపు గరిష్ట స్థాయి కావడ విశేషం. నిఫ్టీ ఇంట్రా ట్రేడింగ్లో ఒక దశలో ఏకంగా 10,191.90 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరడం విశేషం. మరోవైపు బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 250.47 పాయింట్లు రాణించి 32,432.69 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి పెరిగిందన్న ప్రభుత్వ గణంకాలతో శుక్రవారం మార్కెట్లు పరుగులు పెట్టేలా చేశాయని బ్రోకర్ వర్గాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటే ఆర్బీఐ కూడా వడ్డీ రేట్ల కోతకు ఆసక్తి చూపవచ్చన్న అంచనాలూ మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. బీఎస్ఈలో రంగాల వారిగా బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 1.33 శాతం పెరిగింది. ఇదే క్రమంలో టెక్ 1.23 శాతం, లోహ సూచీ 1.17 శాతం, రియాల్టీ 0.54 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు వైద్య సూచీ 0.29 శాతం, ఎఫ్ఎంసీజీ 0.25 శాతం, కాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.14 శాతం చొప్పున కుంగి అధిక నష్టాలు చవి చూశాయి.