Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సంస్థ విలీనపు చర్చలు కొలిక్కి..
- సూక్ష్మరుణాల్లో దిగ్గజ సంస్థగా అవతరణ
- ప్రతి వెయ్యి షేర్లకు 639 బ్యాంకు షేర్లు
- డీల్ మొత్తు విలువ రూ.15,487 కోట్లు
న్యూఢిల్లీ: భారత్లోని అతిపెద్ద సూక్ష్మ రుణాల జారీ సంస్థల జాబితాలో డచ్కు చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్ స్థానం సంపాదించుకోనుంది. ప్రముఖ సూక్ష్మ రుణాల జారీ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లిమిటెడ్ విలీనం ద్వారా ఇండస్ ఇండ్ ఈ ఘనతను సొంతం చేసుకోనుంది. విలీనానికి సంబంధించి ఇరు సంస్థల సంస్థల మధ్య రెండు నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదం అయ్యాయి. విలీన ఒప్పందంలో భాగంగా ప్రతి వెయ్యి భారత్ ఫైనాన్షియల్ షేర్లకు బదులుగా ఆ సంస్థ వాటాదారులకు 639 ఇండస్ఇండ్ బ్యాంకు వాటాలను అందించున్నారు. ఈ ప్రతిపాదనకు డచ్ బ్యాంక్ అంగీకారం తెలిపింది. ఈ ఒప్పంద విలువ రూ.15,487 వేల కోట్లు. విలీనానికి గాను ప్రతి షేర్ విలువను రూ.1118.47గా ఇరు సంస్థలు ఒప్పందంలో నిర్ణయించాయి. శువ్రారం మార్కెట్ ముగిసే సమయానికి భారతీ ఫైనాన్షియల్ షేర్ రూ.1,004 వద్ద స్థిరపడింది. దీంతో పోల్చితే ఆ సంస్థ వాటాదారులకు 11.4 శాతం తక్షణం ప్రీమియం లాభం లభించనున్నట్టయింది.
ఇరు సంస్థలకు మేలు..
ప్రస్తుత విలీనం మూలంగా ఇరు సంస్థలు బలోపేతం కానున్నాయని ఇండస్ ఇండ్ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ సోబ్తి పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల తమకు పలు లాభాలు చేకూరనున్నాయని ఆయన వెల్లడించారు. ఈ కంపెనీతో తమకు 10 ఏళ్ల పైగా అనుబంధం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజస్ సంస్థకు తాము రూ.410 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. భారత్ ఫైనాన్షియల్ సంస్థ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా విస్తరించి ఉందనిఇది తమ బ్యాంకు విస్తృతిని గ్రామీణ భారతంలో వేగంగా విస్తరించేందుకు కలిసి వస్తుందని ఇండస్ ఇండ్ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా 2019 నాటి కల్లా మైక్రోఫైనాన్స్ రంగంలో ఇండస్ ఇండ్ బాంక్ ప్రధాన పాత్రను పోశించనుందని డచ్ బ్యాంకు విశ్లేషించింది.
324 జిల్లాల్లో కార్యకలాపాలు
భారత్ ఫైనాన్షియల్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందిస్తుంది. దాదాపుగా 68 లక్షల మంది రుణ గ్రహీతలున్నారు. భారత్ ఫైనాన్సీయల్ 324 జిల్లాల్లో 1275 శాఖలతో దాదాపుగా లక్ష గ్రామాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థలో 14,666 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపుగా రూ.9631 కోట్ల స్థూల రుణాలు పోర్టుపోలియో ఈ సంస్థ సొంతం. గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు వల్ల క్రితం జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.37 కోట్ల నష్టాలు చవి చూసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.235 కోట్ల నష్టాలు నమోదు చేసుకుంది. దీంతో పోల్చితే జూన్ త్రైమాసికంలో కొంత పుంజుకుంది. ఆస్తుల్లో ఇండుస్ఇండ్ బ్యాంకు దేశంలోనే ఆరో పెద్ద ప్రయివేటు బ్యాంకుగా ఉంది. క్రితం సెప్టెంబర్లోనే భారత్ ఫైనాన్షియల్ కొనుగోలు కోసం చర్చలు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల విలీనంతో ఈ గ్రూపు శాఖలు 2,600 శాఖలకు పెరగనున్నాయి. కాగా ఈ విలీనం నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భవిష్యత్తు భారత్దే!
- రానున్న రోజుల్లో మేటి వృద్ధికి పుష్కలంగా అవకాశాలు
- ప్రపంచ ఆర్థికం పుంజుకోవడంతో కలిసి వస్తుంది
- పెట్టుబడులకు మా దేశంలో దండిగా అవకాశాలు
- పెద్దనోట్ల రద్దు మా సాహసోపేతమైన నిర్ణయమే
- ఆ చర్యతో దీర్ఘకాలంలో భారత్కు మేలు జరుగుతుంది : యూఎస్ పెట్టుబడిదారుల మీట్లో అరుణ్ జైట్లీ
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుండడం, సర్కారు చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణల కారంణంగా రానున్న రోజుల్లో భారత వృద్ధి రేటు మెరుగ్గా నమోదయ్యే అవకాశముందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత మౌలిక రంగంలో పుష్కలమైన అవకాశాల నేపథ్యంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధికి మరింత ఊతం ఇవ్వనుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో రానున్న సంవత్సరాల్లో భారీ పెట్టుబడులకు భారత్ మేటి గమ్యస్థలిగా నిలువనుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దును జైట్లీ ఒక సాహసోపేతమైన నిర్ణయం అని పేర్కొన్నారు. రద్దు కారణంగా స్వల్ప కాలంలో ప్రభావం ఉంటుందని తమకు ముందే తెలుసునని అన్నారు. అయితే దీర్ఘకాలంలో ఇది దేశానికి మేలు చేయగలదని ఆయన అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల, కార్పొరేట్ సంస్థల అధినేతల సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలోని పలు అంశాలపై తన వివరణనిచ్చారు. భారత్ను పెట్టుబడిదారుల స్నేహపూర్వక గమ్య స్థలిగా మార్చేందుకు గాను తమ సర్కారు పలు చర్యలు చేపట్టిందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ దేశాల జాబితాలో మెరుగై ర్యాకింగ్తో ముందుకు సాగుతున్నట్టుగా తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడిని డిజిల్ ప్లాట్ఫారమ్పైకి చేర్చి ప్రభుత్వ పథకాల లబ్దిని అందిస్తున్నట్టుగా తెలిపారు. ఫలితంగా దాదాపు దేశంలో ప్రజలందరికీ బయోమెట్రిక్ గుర్తింపుతో పాటు ప్రతీ ఒక్కరు బ్యాంకు అనుసంధానతను కలిగి ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్ భారీగా టెక్నాలజీని వాడుకుంటోందని అన్నారు. భారత్లోని అవకాశాలతో పాటు సర్కారు చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలను గురించి అమెరికాలోని పెట్టుబడిదారులకు పూర్తి అవగాహన ఉందని ఆయన అన్నారు. ఆపిల్, బోయింగ్, గూగుల్తో పాటు అమెరికాలోని ప్రధాన కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు వారం రోజుల పాటు జరిగిన యూఎస్ఐఎస్పీఎఫ్ పెట్టుబడిదారుల సమావేశం ఈ సమావేశంతో ముగిసింది. జైట్లీ వారం రోజుల అమెరికా పర్యటన కూడా ఈ సమావేశంతో ముగిసింది.