Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్తగా ముద్రిస్తున్న రూ.500, రూ.2000 నోట్లపై ప్రధానిమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన 'క్లీన్ ఇండియా మిషన్' ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా లేదా అన్న వివరాలను వెల్లడించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిరాకరించింది. అ అంశంపై కేంద్ర బ్యాంకును సహ చట్టం ద్వారా అడిగిన వివరణకు స్పందిస్తూ.. నోట్లపై కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రిింటింగ్ వివరాలతో కూడిన సంబంధిత పత్రాల మార్గదర్శకాలను ఇవ్వలేమని పేర్కొంది. భద్రతా కారణాల దష్ట్యా ఆ వివరాలను పంచుకోలేమని తెలిపింది. ముఖ్యంగా 'కొత్త నోట్లు ఎలా ఉంటాయి.. మెటీరియల్, డిజైన్ ఇవన్నీ నోట్లకు సంబంధించిన భద్రతా పరమైన ఫీచర్లని వివరించింది. వీటిని ప్రజలకు చెప్పలేమని తెలిపింది. ఇందుకు సెక్షన్ 8(1)(ఎ) కింద మినహాయింపు ఉందని ఆర్బీఐ పేర్కొంది. మరోవైపు ఇది దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే అంశమని కూడా తెలిపింది.