Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అద్బుత ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ.2200కే 4జీ వొల్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్ ఫోన్ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ మైక్రోమ్యాక్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మైక్రోమ్యాక్స్ భారత్-1 పేరుతో 4జీ వొల్ట్ ఫోన్లను సరఫరా చేయనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రతి నెల రూ.97 రీచార్జీ చేసుకోవడ ద్వారా అపరిమిత కాల్స్, డాటా పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాగా ముందు చెల్లించిన సొమ్ము రిఫండ్ చేయడం లేదు. మొబైల్ వినియోగంపై కూడా ఎలాంటి షరతులు విధించలేదు. ఇతర టెల్కోల లాగా బీఎస్ఎన్ఎల్ కనిపించని షరతులు విధించకపోవడం విశేషం. అయితే ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి రోజుకు, నెలకు ఎంత మొత్తం డాటా అందించేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. దేశంలో ఇప్పటికీ 50 కోట్ల మంది ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారని, వారికి చేరువ కావడానికి ఈ సంయుక్త భాగస్వామ్యం దోహదం చేస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. తర్వాత దశ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంలో భాగంగా బీఎస్ఎన్ఎల్, మైక్రోమ్యాక్స్లు పని చేస్తున్నాయని, ఈ విజన్కు తాము అభివృద్ధి చేసిన భారత్-1 ఫోన్ మద్దతు చేస్తుందని భావిస్తున్నామని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకులు రాహుల్ శర్మ పేర్కొన్నారు.
భారత్-1 ఫోన్ వివరాలివే..
- 2.4 అంగుళాల క్యూవీజీఏ తెర
- 2ఎంపీి కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా
- 4జీ వొల్ట్కు మద్దతు డ్యూయల్ సిమ్, వైఫై, జీపీఎస్ సౌకర్యాలు
- 2000 ఎంఏహెచ్ బ్యాటరీ
- క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్
- 512 ఎంబీ ర్యామ్
- 4జీ రోమ్