Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో ఎర్గోనామిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆవిష్కరణలో: హ్యూమన్ స్కేల్ కంట్రీ మేనేజర్ అలస్టెయిర్ స్టబ్స్
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఆఫీసు ఉద్యోగుల సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రత్యక్ష ఉత్పత్తుల రూపకల్పనలో పెరుగాంచిన హ్యూమన్ స్కేల్ తన సేవలను మరింత విస్తరించే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ఎస్కే డిజైనర్ సహకారంతో హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఎర్గోనామిక్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆవిష్కరించింది. ఈ సెంటర్లో హ్యూమన్ స్కేల్ వారి వినూత్నమైన, ఆఫీసులక సరిపోయే ఉత్పత్తులు..కుర్చీలు, కీబోర్డులు, సిస్టమ్స్, మానిటర్ఆర్మ్స్, ఎల్ఈడీ లైట్లు, కావాల్సిన రీతిలో సర్దుబాటు చేసుకోతగ్గ టేబుల్స్ వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా కంపెనీ కంట్రీ మేనేజర్ అలస్టెయిర్ స్టబ్స్ మాట్లాడుతూ రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇటువంటి సెంటర్లను దశల వారిగా ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. కాగా ఈ సంస్థ తొలి సెంటర్ను నాగ్పూర్లో ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన 'ఫ్రీడం చేయిర్' ఆఫీసు ఎర్గోనామిక్స్లో మార్గదర్శకమైనదని, ఆఫీసు సీటింగ్లో ఉన్నత ప్రమాణాలతో తయారు చేయబడిందని ఆయన తెలిపారు. ఫ్రీడం చైర్ సంప్రదాయ ప్రత్యేక కుర్చీల భావనకు నిర్వచనం కల్పిస్తుందని వివరించారు.