Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నటి రకుల్ప్రీత్ చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఉబేర్ సంస్థ ఇంటి వద్దకే ఆహార పదార్థాలను సప్లయి చేసే వ్యాపార సేవలను బుధవారం హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రజలు ఇష్టపడి కోరుకునే ఆహారాన్ని అందిం చేందుకుగాను ఉబేర్ అందుబాటులోకి తెచ్చిన ఆన్-డిమాండ్ ఫుడ్ డెలివరీ యాప్ 'ఉబేర్ ఈట్స్' యాప్ను ప్రముఖ సినీ నటీ రకుల్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉబేర్ ఎవిరీథింగ్ అధికారి జాసన్ డ్రోగ్, ఉబేర్ ఇట్స్ ఇండియా అధికారి భావిక్ రాథోడ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని దాదాపు 300లకు పైగా రెస్టారెంట్లకు చెందిన ఆహార పదార్థాలను తాము ఈ యాప్ ద్వారా హైదరాబాదీలకు అందించనున్నట్టుగా డ్రోగ్ తెలిపారు.ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడు తూ ఇప్పటికే దేశంలోని ఆరు నగరాలలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పుడ హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరిం దని వివరించారు. తమ సేవలను ప్రాథమిక స్థాయిలో మాదాపూర్, కొండా పూర్, గచ్చిబౌలి, కూకట్పల్లితో పాటు పలు జనసాంద్రత అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఆయన వివరించారు.