Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశించిన స్థాయిలో వ్యవస్థలో విధానాల అమలు ముందుకు సాగడం లేదని ప్రముఖ ప్రవాస పారిశ్రామికవేత్త జి.పి.హిందుజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశిస్తున్నంత వేగంగా విధానాల అమలు జరగడం లేదనీ.. ఈ విషయంలో వ్యవస్థ విఫలమైందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఇక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఏర్పాటు చేసిన 'ఇన్వెష్ట్ ఇన్ ఇండియా' కార్య క్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రిటన్ భారతీయులు ఇండియాలో పెట్టుబ డులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వేరుపడడంతో బ్రిటన్లో ఆర్థిక అనిశ్చితి ఏర్పడిం దని అన్నారు. బ్రెగ్జిట్ బ్రిటన్ ప్రభుత్వాన్ని బలహీ నపరిచిందని అన్నారు.