Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : స్టాక్ ఎక్సేంజీలు, నియంణ్రత సంస్థల కన్నా ముందే కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో లీకు అయ్యాయి. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టింది. ఆ కంపెనీల సమాచారం లీకును ఆధారంగా చేసుకొని ఎవరెవరూ ఆ షేర్లు ట్రేడింగ్ చేశారో తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షేర్ల ట్రేడింగ్ డేటాపై దర్యాప్తు చేయాలని ఎక్సేంజీలను సెబీ ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రకారం లిస్టెడ్ కంపెనీలు తమ ఆర్ధిక ఫలితాలను ముందుగా ఎక్సేంజీలకు సమర్పించాకే వెల్లడించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా రెండు డజన్లకు పైగా కంపెనీలు లీకులకు పాల్పడ్డాయని ఆరోపణలు వస్తున్నాయి. అదే జరిగితే ఆయా కంపెనీలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. సెబీ 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే