Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్కు చెందిన 5.7 కోట్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు ఆ సంస్థ తెలిపింది. గత ఏడాది అక్టోబర్లో హ్యాకర్లు ఈ డేటాను హ్యాక్ చేశారు. హ్యాక్ అయిన సమాచారాన్ని సైట్లలోంచి తొలగించేందుకు ఉబేర్ హ్యాకర్లకు భారీ ఎత్తున 1,00,000 డాలర్లు (దాదాపు రూ.65కోట్లు) చెల్లించినట్లు సమాచారం. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకోగలిగామని ఉబర్ సీఈవో డారా ఖోస్రోషాహి తెలిపారు. సంస్థ క్లౌడ్ సర్వర్ను హ్యాక్ చేసి డేటాను దొంగలించినట్లు ఆయన తెలిపారు. హ్యాక్ అయిన డేటాలో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్ల వివరాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.