Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విమానాల్లో ప్రయాణించాలంటే ఇకపై తప్పని సరిగా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి రానుంది. ఇలా చేసుకున్న వారు విమానాశ్రయంలోకి ఎలాంటి ఇతర సెక్యూరిటీ చెక్కులు లేకుండా ప్రవేశించేలా నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 'డిజి యాత్ర'లో భాగంగా దీన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో విమానయాన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం ద్వారా విమానాశ్రయంలోకి ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, నేరుగా లోపలికి ప్రవేశించవచ్చట. దీనికి తోడు వచ్చే ఏడాది నుంచి ఎయిర్పోర్టుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను అమలుఓకి తీసుకురా నున్నారు. ఫలితంగా ప్రయాణికుల వ్యక్తిగత గుర్తింపు సులభం కానుంది. 2018 నుంచి ఈ వ్యవస్థను అమలులోకి తేనున్నట్టుగా సర్కారు వర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, కోల్కతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల తొలత ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థ ప్రకారం ఇది వరకు గుర్తింపు కార్డులు చూపించడం, పేపర్ టికెట్లు, బోర్డింగ్ కార్డులు చూపించాల్సి వస్తోంది ఆధార్ లింక్తో ఎయిర్పోర్టులకు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుంది. విమా నాశ్రయంలోకి ప్రవేశించే సమయంలో ఈగేట్ వద్ద టికెట్ మీద ఉన్న బార్ కోడ్ను చూపించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఆధార్ సమాచారం, ప్రయాణికుడి వివరాలు కనిపిస్తాయన్నారు. అనంతరం బయో మెట్రిక్ వద్ద ప్రయాణికుడి వేలి ముద్ర సరిపోలితే ఈగేట్ తెరుచుకుంటుందన్నారు.ఆతర్వాత సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందన్నారు.