Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు సభ్యులతో టాస్క్ఫోర్స్
- ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టు రూపకల్పన
- 6 నెలల్లోనే సర్కారు చేతికి నివేదిక
- జీఎస్టీ వెతల నేపథ్యంలో కొత్త భయాలు!
న్యూఢిల్లీ: దేశంలో ఆఘమేఘాలపై వస్తుసేవల పన్నును (జీఎస్టీ) అందాబాటులోకి తెచ్చి ఇటు ప్రజలకు అటు వర్తకులకు సమస్యలు సృష్టించిన సర్కారు.. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో భారీ పన్ను సంస్కరణకు రంగం సిద్ధం చేసింది. దేశంలో దాదాపు 56 ఏండ్ల కిందట అమలులోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం -1961'ను మన ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా సవరించేందుకు గాను ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. బుధవారం ఆర్థిక మంత్రుత్వ శాఖ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో ప్రధాని మోడీ టాక్స్ ఆధికారుల వార్షిక సమావేశం సందర్భంగా 'ఐటీ యాక్ట్-1961'ను సవరించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించడం తెలిసిన విషయమే. దీనికి అనుగుణంగానే సర్కారు ఐటీ యాక్ట్పై టాస్క్ఫోర్స్ ఏర్పాటు జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో అమలులో ఉన్న మేటి ఆదాయపు పన్ను విధానాలను అధ్యయనం చేసి మన ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా కొత్త ఆదాయపు పన్ను ముసాయిదా డాక్యుమెంట్ను తయారు చేయాల్సిందిగా సర్కారు టాస్క్ఫోర్స్కు సర్కారు దిశానిర్దేశం చేసింది.
టాస్క్ఫోర్స్కు మోడీ సారథ్యం...
ఆరుగురు సభ్యులుండనున్న ఈ టాస్క్ఫోర్స్కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యులు (శాసన నిర్మాణం) అరబింద్ మోడీ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ఇతర సభ్యులుగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెట్ గిరీష్ అహూజా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రాంతీయ విభాగం చైర్మెన్ రాజీవ్ మెమానీ, ఐసీఆర్ఐఈఆర్ కన్సెల్టెంట్ మన్సీ కేడియా తదితరలు సభ్యులుగా ఉండనున్నారు. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఈ టాస్క్ఫోర్స్లో శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆదాయపు పన్ను టాస్క్ ఫోర్స్ ఆరు నెలల్లో తన నివేదికను సర్కారుకు సమర్పించనుంది.
గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు..
దేశంలో అమలులో ఉన్న ఐటీ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాన్ని అమలులోకి తేవాలని గతంలో యూపీఏ సర్కారు కూడా నిర్ణయించుకుంది. ఇందుకు గాను ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు, కార్పొరేట్లకు కూడా అందుబాటులో ఉండేలా సరళీకరించేందుకు గాను 2009లో డైరెక్ట్ టాక్సెస్ కోడ్ను (డీటీసీ) అందుబాటులోకి తేచ్చింది. ఈ డీటీసీ బిల్లు 2010లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. 15వ లోక్సభ రద్దవడంతో ఈ బిల్లుకు కాలం చెల్లింది. 2014లో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనరల్ యాంటీ-అవాయిడెన్స్ రూల్స్ను (గార్) అమలులోకి తెచ్చింది. 2016లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తూ పన్ను సరళీకరణలో భాగంగా కార్పొరేట్ టాక్స్ను రానున్న అయిదేండ్లలో 25 శాతానికి చేర్చనున్నట్టుగా ప్రకటించిన సంగతి విదితమే.