Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏసర్ ఇండియా శుక్రవారం ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో నూతన గేమింగ్ ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఈ ల్యాప్టాప్ ధర రూ.6,99,999గా నిర్ణయించింది. బెర్లిన్లో 2016లో ఐఎఫ్ఏలో తొలుత దీన్ని ఆవిష్కరించారు. శనివారం మార్కెట్లోకి తెచ్చింది. కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్ ల్యాప్టాప్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాప్ టాప్ లో వీడియో గేమ్ ఆడుతుంటే ధియేటర్ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుందని ఆ కంపెనీ పేర్కొంది. ఫ్లిప్కార్ట్లో ప్రీ-ఆర్డర్కు వచ్చిన ఈ ల్యాప్ట్యాప్, డిసెంబర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది. విండోస్ 10 ఆధారంగా రూపొందించిన ఈ ల్యాప్టాప్ అమెరికాలో దీని ధర 8,999 డాలర్లుగా (సుమారు రూ.5.77 లక్షలు) .