Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీల్ మిట్టల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఒకానొక తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని భారతీ ఎయిర్టెల్ అధిపతి సునీల్ మిట్టల్ అన్నారు. ఒకానొక సమయంలో రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయన్నారు. రూ.5000 కోసం బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ను ఆశ్రయించానని తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన టైకాన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ తన వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కున్నానని తెలిపారు. బ్రిజ్ మోహన్ను రూ.5000 కావాలని కోరానన్నారు. చెక్ పట్టుకుని వెళ్తున్న తనను ఒక్క క్షణం ఆపి 'దీన్ని అలవాటుగా మార్చుకోకు' అంటూ ఆయన ఇచ్చిన సలహా ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పారు. ఆయన మాటలు తన హ దయాన్ని నేరుగా తాకాయన్నారు. ఆ రోజు నుంచి తాను ఆర్థికంగా వెనుదిరిగి చూసుకోలేదని పేర్కొన్నారు.
అదేవిధంగా ఆఫ్రికాలో అడుగుపెట్టాలనుకోవడం కూడా తప్పయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్నది కొంత తొందరపాటు నిర్ణయంగా పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయాల్సి వచ్చిందని అన్నారు.