Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీి) అమలు అంశంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50వేల కన్నా ఎక్కువ విలువైన సరకు రవాణాకు ఇ-వే బిల్లును తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. శనివారం నిర్వహించిన 24 జీఎస్టీిి కౌన్సిల్ సమావేశంలో ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇ-వే బిల్లు అమలును ముందుకు జరిపారు. సెప్టెంబర్ మాసం వసూళ్లతో పోల్చితే అక్టోబరులో జీఎస్టీి వసూళ్లు రూ.12,000కోట్లు తగ్గాయి. దీంతో కేంద్రం ఇ-వే బిల్లు అమలుపై దృష్టి పెట్టింది. జనవరి 16లోపు ఇ-వే బిల్లు వ్యవస్థను ప్రయోగాత్మక దశ చేపట్టనున్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. 2018 ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ స్టేట్ ఇ-వే బిల్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. జూన్ 1 నుంచి ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లును అమల్లోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇ-వే బిల్లు అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రాష్ట్రం లోపల రూ.50వేల కోట్ల విలువ చేసే సరుకు 10 కిలోమీటర్ల పైబడిన దూరాలకు ఇ-వే బిల్లును తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈ ఇ-వే బిల్లును 2018 మార్చి నుంచి అమల్లోకి తీసుకురావాలని గత జులై 1న జీఎస్టీి ని అమల్లోకి తెచ్చిన సందర్బంలో నిర్ధేశించుకున్నారు. కాని సాంకేతిక కారణాల వల్ల దీన్ని ముందుకు జరిపారు. ప్రస్తుతం కర్ణాటక సహా ఆరు రాష్ట్రాలు ఇ-వే బిల్లు అమలుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. మరికొన్ని రాష్ట్రాలు ఇ-వే బిల్లులో సవరణలు చేస్తే దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయన్నారు.