Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: వచ్చే కొన్ని ఏండ్లలో భారత వృద్ధి రేటు పెరుగొచ్చని ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మరో 20 సంవత్సరాల్లో దేశ వృద్ధి రేటు 8 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. పెట్టుబడులు, ప్రజల జీవనశైలిలో మెరుగైన మార్పులతో ఇది సాధ్యమవుతుందని ఐరాసలో ఎకనామిక్ ఎఫైర్స్ అధికారి సెబాస్టియన్ వెర్గారా పేర్కొన్నారు. ఇందుకోసం భారత్ ఎక్కువగా పెట్టుబడులపై దష్టిపెట్టడం, ప్రజల జీవనశైలిని మెరుగుపరిచే దిశగా ఆలోచించడం వంటివి చేయాలని సూచించారు.