Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఎయిర్ అన్ని చార్జీలు కలుపుకొని రూ.1157లకే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. ఫ్లై స్మార్ట్, సేవ్ మోర్ స్కీం కింద ఈ ఆఫర్ను అందిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. జనవరి 22 తో ఈ ఆఫర్ బుకింగ్స్ ముగుస్తాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 1 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 15 దాకా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా పండగసీజన్, కొత్త ఏడాది, ఎక్కువ వారాంత సెలవుల సందర్బంగా ఈ డిస్కౌంట్ ఆఫర్ను అందించాలని నిర్ణయించామని గో ఎయిర్ పేర్కొంది. ఈ డిస్కౌంట్ పాటు గోఎయిర్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 10శాతం అదనపు తగ్గింపుకూడా ఇస్తున్నామని తెలిపింది. ఇలా వన్ వేలో రూ.250 తగ్గింపును, రిటర్న్ టికెట్ బుకింగ్పై 500 ఆఫర్ చేస్తోంది. ఆ కంపెనీ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్-లక్నో రూ. 3002, హైదరాబాద్ -అహ్మదాబాద్ రూ.3362, లక్నో-హైదరాబాద్ టికెట్ ధరలను రూ. 3574 గాను నిర్ణయించింది. అదే విధంగా లక్కో-ఢిల్లీ, బెంగళూరు-కొచ్చి, పుణె-బెంగళూరు, గౌహతి-కోల్కతా, పుణె-అహ్మదాబాద్, ఢిల్లీ-పాట్నా మధ్య రాయితీ ప్రయాణాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.