Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత జనవరి నెలలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐకి చెందిన ఎకనమిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రూపొందించిన ఒక నివేదికలో తెలిపింది. అయితే ఈ నెల తర్వాత మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తమ అంచనాలకు తగ్గట్టే 2017 డిసెంబరు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.21 శాతానికి ఎగిసి 17 నెలల గరిష్టానికి చేరిందని ఆ సంస్థ పేర్కొంది. నవంబరులో ఇది 4.88శాతంగా ఉందని, కాగా దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. జనవరిలో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది. దీంతో ఈ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరు కంటే తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా జనవరి తర్వాత నుంచి జూన్ వరకు మాత్రం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో సగటున ద్రవ్యోల్బణం 5.5శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది. అయితే జులై తర్వాత నుంచి డిసెంబరు వరకు మాత్రం మళ్లీ తగ్గుముఖం పట్టి 4శాతం కిందకు చేరే అవకాశం ఉందని ఆ రిపోర్టు తెలిపింది.