Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్, యోగా గురు బాబా రామ్దేవ్కు చెందిన పతాంజలి ఉత్పత్తులు అన్ని ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఎనిమిది ప్రముఖ ఈ-కామర్స్ పోర్టళ్లతో మంగళవారం హరిద్వార్లో బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో ఒప్పందాలు జరిగాయి. ఈ-కామర్స్ పోర్టళ్ల సాయంతో తమ ఉత్పత్తులు ప్రతి ఇంటి గుమ్మానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్దేవ్ బాబా పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడాదికి 50వేల కోట్ల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు రామ్దేవ్ తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ధేశించుకున్నామన్నారు. బహుళ జాతి సంస్థలకు వ్యతిరేకంగా విమర్శలు చేసే రామ్దేవ్ బాబా అమెజాన్ లాంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదర్చుకోవడం గమనార్హం.