Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీవోఎం జోనల్ మేనేజర్ దీపక్ ఎన్. భండారీ
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: స్వచ్ఛతపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) జోనల్ మేనేజర్ దీపక్ ఎన్.భండారీ కోరారు. మంగళవారం జోనల్ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో బ్యాంక్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జీఎస్ బాగుర్కర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టిఎస్ రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 31 వరకు సచ్ఛ సర్వేక్షణ్-2018 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.