Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను కట్టాలని నోటీసులు!
ముంబయి: వర్చువల్ కరెన్సీల్లో అత్యంత ప్రాచుర్యం బిట్కాయిన్కి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అందరి దష్టిని కూడా ఈ బిట్కాయిన్ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్ ట్రేడర్లకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) గట్టి షాకిచ్చింది. బిట్కాయిన్ ట్రేడింగ్ చేసిన వేలాది మందికి పన్ను కట్టాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు వెల్లడికావడంతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టెక్నాలజీతో పరిచయం ఉన్న మదుపర్లు, స్థిరాస్తి, నగల వ్యాపారులు బిట్కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లోని తొమ్మిది ఎక్సేó్ఛంజీల్లో అధికారుల సమాచారం సేకరించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ క్రిప్టోకరెన్సీను ఎలా నియంత్రించాలో తెలియక సతమతవుతున్న విషయం విదితమే.