Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ బ్యాంకులకు సీవీసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో(పీఎన్బీ) జరిగిన భారీ మోసం తాలూకు ప్రకంపనలు దేశీయ బ్యాంకిం గ్ రంగంపై ప్రభావం చూపు తున్నాయి. బ్యాంకు లో పనిచేసే అధికారులే.. నింది తులకు కొమ్ముకాసి.. భారీ మోసానికి పాల్పడుతున్నట్లు పీఎన్బీఐ కుంభకోణతో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తాజా ఆదేశాలను జారీ చేసింది. బ్యాంకు అధికారులను మూడేళ్లకు ఒక సారి తప్పని సరిగా బదిలీ చేయాలని సూచించింది. అంతేగాక.. డిసెంబరు 31, 2017 నాటికి తమ ప్రస్తుత స్థానంలో మూడేళ్ల సర్వీ సును పూర్తి చేసుకున్న అధికారులను, ఐదేండ్ల సర్వీసును పూర్తి చేసు కున్న క్లరికల్ సిబ్బందిని తక్షణమే మరో ప్రాంతానికి బదిలీ చేయాలని స్పష్టం చేసింది. సీవీసీ ఆదేశాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 'కేంద్ర విజిలెన్స్ కమిషన్ సరికొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకు అధికారులను ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయాలి. అంతేగాక బ్యాంకు అధికారుల బదిలీ నియమాల ప్రకారం.. ఏ అధికారి మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉండకూడదు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయకూడదు' అని బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా అధికారిక మెమొరండమ్లో పేర్కొంది.