Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా' (ఐసీఏఐ) ఎస్ఐఆర్సీ హైదరాబాద్ శాఖకు కొత్త కార్యనిర్వాహక వర్గం ఎంపికైంది. సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ఐసీఏఐ హైదరాబాద్ శాఖ కొత్త చైర్మెన్గా సునీల్ కుమార్ మండవ ఎంపికయ్యారు. వైస్ చైర్మెన్గా వై.వి.భాను నారాయణ రావు, కార్యదర్శిగా సి.వెంకట్రామ్, కోశాధికారిగా పంకజ్ కుమార్ త్రివేది ఎంపికయ్యారు. కొత్త కార్యవర్గం సోమవారం స్వీకరించింది. 2018-19 కాలానికి ఈ కార్యవర్గం ఎస్ఐఆర్సీ హైదరాబాద్ విభాగం అభివృద్ధికి సేవలందించనుంది. ఐసీఏఐ ప్రధాన శాఖల్లో ఎస్ఐఆర్సీ హైదరాబాద్ విభాగం ఒకటి. 1961లో ఏర్పాటు చేసిన ఈ శాఖలో మొత్తం 8500 సభ్యులు, 25000 మంది సీఏ కోర్సును అభ్యసించే విద్యార్థులు ఉన్నారు. దినదిన ప్రవర్థమానకంగా ఈ శాఖ విస్తరిస్తూ వస్తోంది. దీనికి తోడు సీఏలకు, సీఏ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను ఎస్ఐఆర్సీ హైదరాబాద్ విభాగం ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, బ్యాంకింగ్ తదితర ఆర్థిక అంశాలపై తరుచూ అవగాహన సదస్సులను నిర్వహిస్తూ వస్తోంది.