Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ 1,200 కేసులకు సంబంధించిన దాదాపు రూ.3900 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ప్రాథమికంగా అటాచ్ చేసినట్టుగా ఆర్థిక మంత్రుత్వ శాఖ మంగళవారం రాజ్యసభకు వెల్లడించింది. బినామీ ఆస్తులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లిఖితపూర్వ సమాధానమిస్తూ ఫిబ్రవరి ముగింపు నాటికి దాదాపు 1600 బినామీ లావాదేవీలు నమోదు అయినట్టుగా రాజ్యసభకు వివరించారు. ఆదాయపు పన్ను శాఖ బినామీ ఆస్తులకు సంబంధించిన 1500 కేసులకు షోకాజ్ నోటీసులను జారీ చేసినట్టుగా ఆయన వివరించారు. ఇందులో దాదాపు 1200 కేసులకు సంబంధించిన ఆస్తులను ప్రాథమికంగా అటాచ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.3,900 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో అధిక మొత్తంలో నగదును డిపాజిట్ చేసి సదరు మొత్తానికి సరిపడా.. ఐటీ రిటర్న్స్ చూపని దాదాపు 22.69 లక్షల మందిని ఆదాయపు పన్ను శాఖ తన విశ్లేషణల్లో గుర్తించినట్టుగా మంత్రి మరో సమాధానంగా రాజ్యసభకు వెల్లడించారు.