Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్వోయూ, ఎల్వోసీ విధానం రద్దు
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) భారీ స్కామ్కు మూలాధారంగా నిలిచిన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ), లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ) సౌలభ్యాన్ని బ్యాంకుల్లో రద్దు చేయాలని 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) నిర్ణయించింది. అధీకృత డీలర్లందరికీ బ్యాంకులు ఎల్వోయూ, ఎల్వోసీలు జారీ చేసేందుకు వీలుకల్పించే విధానాన్ని రద్దు చేస్తున్నట్టగా పెద్ద బ్యాంకు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోకి దిగుమతులకుద్దేశించిన వాణిజ్య రుణాల కోసం ఎల్వోయూ (స్వల్పకాలిక క్రెడిట్ రూపంలో బ్యాంకు మరొక ఇండియన్ బ్యాంకు విదేశీ బ్రాంచి నుంచి రుణం పొందానికి తన కస్టమర్ను అనుమతించే పత్రమే లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్: ఎల్వోయూ) జారీ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్లో ప్రకటించింది. అయితే జూలై 1, 2015 నాటి బ్యాంకింగ్ నిబంధనలను లోబడి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ కీలక నిర్ణయంతో దిగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆర్బీఐ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.