Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) పటిష్టం చేసే క్రమంలో భాగంగా ఆర్థిక శాఖ కీలక చర్యలకు దిగాలని యోచిస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో రుణాలను తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేత దారుల పేర్లు, ఫొటోలను ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ప్రచురించాలని సర్కారు బ్యాంకులను కోరింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ గతంలో జారీ చేసిన విధివిధానాలను ఉఠంకిస్తూ ఆర్థిక శాఖ పీఎస్బీలకు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 'నేమ్ అండ్ షేమ్' కార్యక్రమంలో భాగంగా మరింత కఠిన నిర్ణయాలను తీసుకొంటూ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఆట కట్టించేందుకే తాము తాజా చర్యలకు దిగుతున్నట్టుగా ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు గాను ఆయా బ్యాంకులు ఒక విధానాన్ని రూపొందించుకొని దానిని బోర్డు సమ్మతి తీసుకొవాలని. సదరు విధానాల ప్రకారమే ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోలను ప్రచురించాలని ఆర్థిక శాఖ సూచించింది.