Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న బ్యాంకింగ్ రంగంలో రుణ మోసాలు అంతకంతకు పెరుగుతోన్న వేళ.. బ్యాంకింగ్ ఆడిట్పై బాధ్యత మరింతగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఛార్టర్డ్ అకౌంటెట్లకు బ్యాంకింగ్ ఆడిట్పై మరింత విషయ పరిజ్ఞానాన్ని కల్పించేందుకు గాను 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా' (ఐసీఏఐ) సంస్థ ఎస్ఐఆర్సీ హైదరాబాద్ శాఖ శనివారం (17న) ఒక సెమినార్ నిర్వహించనుంది. గ్రీన్లాండ్స్లోని మ్యారీగోల్డ్ హోటల్లో శనివారం ఈ సెమినార్ ఉంటుందని ఎస్ఐఆర్సీ హైదరాబాద్ శాఖ చైర్మెన్ మండవ సునిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు దేవరాజ్ రెడ్డి పాల్గొననున్నట్టుగా ఆయన వివరించారు.
మూడు సెషన్లలో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్సీ చైర్మెన్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి చిన మస్తాన్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐఆర్సీ సభ్యులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు పాల్గొననున్నారు.