Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా నిలుస్తున్న రిలయన్స్ జియా తన కూతురిచ్చిన ఐడియాకు కార్యరూపమని రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. గురువారం రిలయన్స్ సంస్థ 'డ్రైవర్స్ ఆఫ్ ఛేంజ్' అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖేశ్ తన కుటుంబ సభ్యులతో సహా కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'జియో ఐడియా నా కూతురు ఇషాది. 2011లో దీని గురించి ఇషా నాకు వివరించింది. ఆ సమయంలో ఇషా సెలవుల నిమిత్తం అమెరికా నుంచి భారత్కు వచ్చింది. ఓ రోజు ఇంట్లో తన కోర్సుకు సంబంధించిన వర్క్ చేసుకుంటోంది. అప్పుడు 'డాడీ మన ఇంట్లో నెట్ అస్సలు బాలేదు' అంది. భవిష్యత్తులో ప్రపంచం డిజిటల్ టెక్నాలజీతోనే నడుస్తుందని ఇషా, ఆకాశ్ నాకు చెప్పారు. అలా వారి ఆలోచనల నుంచే ఈ జియో పుట్కుకొచ్చింది. జియెను 2016 సెప్టెంబర్లో ప్రవేశపెట్టాను. ఇప్పుడు భారతదేశంలో జియో గేమ్ ఛేంజర్గా మారింది. దేశ వ్యాప్తంగా 2జీ నెట్వర్క్ను ఏర్పాటుచేయడానికి భారతీయ టెలికాం రంగానికి 25 ఏళ్లు పట్టింది. కానీ 4జీ ఎల్టీఈ నెట్వర్క్ను రూపొందించడానికి జియోకి కేవలం మూడేండ్లే పట్టింది. 5జీ కూడా సిద్ధమవుతోంది.' అని ముఖేశ్ వెల్లడించారు.