Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్ జారీ చేసే బ్యాంక్ గ్యారెంటీలను ఇకపై తాము స్వీకరించబోమని టెలికాం మంత్రుత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్పై టెలికాం శాఖ ఈ ఆదేశాలు జారీ చేయడంతో మార్గెట్ వర్గాలు ఒక్క సారిగా కంగుతున్నాయి. గతంలో ఈ బ్యాంకు జారీ చేసిన పలు బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన విధివిధానాలకు యాక్సిస్ బ్యాంక్ కట్టుబడకపోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టెలికాం శాఖ వెల్లడించింది. ఈ నెల 16 టెలికాం శాఖ విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండంలో దీనికి సంబంధించి టెలికాం శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఎయిర్సెల్ గ్రూపునకు బ్యాంక్ గతంలో జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీని నిలుపుకోవడంతో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని పేర్కొంది.