Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారీ బడ్జెట్తో నిర్మించతలపెట్టిన 'మహాభారత్' సినిమా నిర్మాణపై రిలయన్స్ అధినేత కన్నేసినట్టుగా సమాచారం. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'మహాభారత్'కు రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాలుగు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవనుంది. కొత్త సంస్థను స్థాపించడం ద్వారా 'మహాభారత్'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే రిలయన్స్ గొడుగు కింద ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్-18ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్లలో ముఖేష్ పెట్టుబడులున్నాయి. ఈ సినిమాను ప్రపంచంలోని సమారు అన్ని భాషల్లోనూ విడుదల చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.