Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన సూపర్బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ మరో కొత్త బైక్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. టైగర్ సిరీస్లో 800 ఎక్స్సీఎక్స్, ఎక్స్ఆర్, తరహా బైక్లను ఆ సంస్థ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త బైక్స్ ధరలను కంపెనీ రూ. 11.76 లక్షల నుంచి రూ.13.76లక్షలుగా (ఎక్స్షోరూం దిల్లీ) నిర్ణయించింది. ఈ బైక్లను 800సీసీ, 3 -సిలిండర్, 94 బీహెచ్పీ పవర్, 79 ఎన్ఎం టార్క్ ఇంజిన్తో రూపొందించారు. కొత్త బైక్స్ను 6-స్పీడ్ గేర్బాక్స్ తదితర అధునాతన ఫీచర్లతో రూపొందించినట్టుగా సంస్థ తెలిపింది. 'ట్రయంఫ్లో మంచి మోడల్స్ను వినియోగదారులకు అందించేందుకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తున్నాం' అని ట్రయంఫ్ మోటార్సైకిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సంబ్లీ అన్నారు.