Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లకు 'ట్రేడ్వార్' గుబులు
- కుదేలైన ప్రపంచ మార్కెట్లు
- 410 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
- ఐదు నెలల కనిష్టానికి సూచీలు
- నాలుగో వారమూ నేల చూపులు
ముంబయి: ప్రపంచ మార్కెట్లలో అమెరికా ట్రేడ్వార్ మరోమారు టెర్రర్ సృష్టించింది. దిగుమతులపై యుఎస్ భారీగా సుంకాలు పెంచుతూ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరిస్తుంది. చైనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్ను బెంబేలిత్తించింది. దీనికి తోడు దేశీయంగా మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మాణ ప్రయత్నం మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. ఈ పరిణామాల మధ్య సెన్సెక్స్ ఐదు నెలల కనిష్టానికి దిగజారింది. నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 409.73 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 32,596.54కు పతనమయ్యింది. గతేడాది అక్టోబర్ 23న సెన్సెక్స్ ఈ స్థాయిలో నమోదయ్యింది. ఇంట్రా ట్రేడింగ్లో 32,720-32,484 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 116.70 పాయింట్లు లేదా 1.15 శాతం దిగజారి 9,998.05కు పడిపోయింది. ఈ క్రమంలో మదుపర్లు 1.57 లక్షల కోట్లు నష్టపోవడంతో విలవిలమన్నారు. దీంతో వరుసగా నాలుగో వారంలోనూ మార్కెట్లు నష్టాలను చవి చూసినట్లయ్యింది. క్రితం ఐదు సెషన్లలో సెన్సెక్స్ స్థూలంగా 579 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 197 పాయింట్లు పడిపోయింది.
17 లక్షల కోట్లు హాంఫట్
వివిధ పరిణామాల మధ్య గత రెండు నెలల్లోనే మదుపర్లు రూ.17 లక్షల కోట్లు పైగా నష్టపోయారు. అమెరికా సృష్టించిన వాణిజ్యం యుద్దానికి తోడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీ భారీ మోసం, మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తదితర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో క్రితం రెండు నెలల్లో బీఎస్ఈ, నిఫ్టీలు 10 శాతం మేర విలువ కోల్పోయాయి. శుక్రవారం ముగింపు నాటికి బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.39 లక్షల కోట్లకు పడిపోయింది. జనవరి 23న రూ.1.56 లక్షల కోట్లుగా ఉంది. దాదాపుగా 17 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. కేవలం ఎస్బీఐ మార్కెట్ కాపిటలైజేషన్ 72వేల కోట్లు నష్టపోయింది.
ఢ అంటే ఢతోీ కుదేలు..
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం మొదలవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. చైనా దిగుమతులకు ట్రంప్ ప్రభుత్వం చెక్ పెట్టాలని నిర్ణయించడంతో అదే స్థాయిలో చైనా కూడా అమెరికా వస్తువుల దిగుమతులపై నియంత్రణలు పెంచాలని నిర్ణయించింది. చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం గురువారం సంతకం చేసింది. ఇరు దేశాల ఈ చర్యలతో ప్రపంచ మార్కెట్లు బేర్మన్నాయి. చైనా వాణిజ్య ఆంక్షలు అమెరికా, యూరప్, ఆసియనా మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. చైనా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల వరకు యుఎస్ సుంకాలను ప్రతిపాదించింది. రెండు దేశాల వాణిజ్య సమస్యలపై ఒప్పందం కుదరని పక్షంలో 3 బిలియన్ డాలర్ల మేర సుంకం విధించనుంది. ఇందుకు అమెరికా మొత్తం 128 ఉత్పత్తులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.