Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంకు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2018 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.2,188.74 కోట్ల నష్టాలను నమోదు చేసింది. 1998లో ఈ బ్యాంకు 1998 లిస్టియినప్పటి నుంచి లాభాల్లో ఎన్నడూ ఈ స్థాయి పతనాన్ని చవి చూడలేదు. 2017 ఇదే మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,225.10 కోట్ల లాభాలు సాధించింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శిఖా శర్మ వ్యవహారిస్తున్నారు. గత త్రైమాసికంలో మొండి బకాయిల కోసం రూ.7,179.53 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది ఇదే క్యూ4లో రూ.2,581.25 కోట్ల కేటాయింపులు జరిపింది. దీంతో పోల్చితే కేటాయింపుల భారం దాదాపు మూడు రెట్లు పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా రూ.121.57 కోట్ల నికర లాభంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో (2016-17లో) ఏకంగా బ్యాంక్ రూ.5,467.56 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. దీంతో పోల్చితే మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరం బ్యాంకు లాభాల్లో ఏకంగా 97.74 శాతం పతనం చోటు చేసుకున్నట్టయింది.