Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానికంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం, వెండి ధరలు పడిపోతూ వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే అపరంజి ధర రూ.430 తగ్గిపోయింది. బుధవాకం మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా నమోదు అయింది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.40,650గా నమోదైంది. వెండి ధర తగ్గడానికి పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గడమే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉండగా 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.31,870గా పలుకుతోంది.