Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జాతీయ పరిణామాలతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పెరిగిన ముడిచమురు ధరలు దేశీయ ద్రవ్యలోటుపై ప్రభావం చూపుతాయనే భయాందోళనల నడుమ మదుపర్లు విస్తృతంగా స్టాక్స్ అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. కర్నాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో గురువారం ఉదయం సూచీలు లాభాలను అందుకున్నాయి.. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో సూచీలు కొద్దిసేపట్లోనే ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 239 పాయింట్లు కోల్పోయి 35,149 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 58 పాయింట్ల నష్టంతో 10,683 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కనబరిచింది.