Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్తో జట్టుకట్టిన ఎయిర్టెల్
ముంబయి: ఫీచర్ ఫోన్ల వినియోగదారులను వీలైనంత ఎక్కువ స్థాయిలో తమ గొడుగు కిందకు తెచ్చుకొనే యత్నాల్లో భాగంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిరల్టెల్ శుక్రవారం గొప్ప ముందడుగు వేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్తో భారతీ ఎయిర్టెల్ చేతులు కలిపింది. వ్యూహాత్మక భాగస్వాములుగా ఈ రెండు సంస్థలు కలిసి బడ్జెట్ ధరల్లో భారతీయులకు స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నట్లు శుక్రవారం వెల్లడించాయి. దేశంలో ఇప్పటికీ స్మార్ట్ఫోన్ వినియోగించని భారతీయులు లక్షల మంది ఉన్నారని, వారందరినీ దృష్టిలో ఉంచుకొనే అతి తక్కువ ధరకు స్మార్ట్ఫోన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ 4జీ స్మార్ట్ఫోన్ల ధరలు రూ.3,999 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించాయి. ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ మాట్లాడుతూ.. అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం భారత్లో మరింత తమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. 'మేరా పెహలా స్మార్ట్ఫోన్ ప్లాన్'లో భాగంగా తాము ఈ చౌక స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిటనట్టుగా ఆయన వివరించారు. దీంతో పాటు ఇరు కంపెనీలు భాగస్వాములుగా మారిన నేపథ్యంలో 65 స్మార్ట్ఫోన్లపై రానున్న రోజుల్లో రూ.2,600 వరకూ క్యాష్ బ్యాక్ను అందించనున్నట్లు ఎయిర్టెల్ సంస్థ బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. ఇందులో శాంసంగ్ సహా, వన్ ప్లస్, షామీ, హానర్, ఎల్జీ, లెనోవో, మోటో తదితర ఫోన్లు ఉన్నాయి. వినియోగదారులు 36 నెలల పాటు ఎయిర్టెల్ నుంచి రూ.2000 క్యాష్బ్యాక్ను.. మరో రూ.600లను రూ.169తో అమెజాన్ ప్లాట్ఫామ్పై రీఛార్జ్ చేసుకోవడం ద్వారా లభించనుందని ఎయిర్టెల్ బీఎస్ఈ వెల్లడించింది.