Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ బ్యాంక్ 8-10 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ దీనబంధు మహాపాత్రో ఆశాభావం వ్యక్తం చేశారు. గత మార్చి త్రైమాసికంలో బ్యాంక్ స్టాండ్బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎస్బీఎల్సీ) ద్వారా జారీ చేసిన దాదాపు రూ.9000 కోట్ల రుణాల రికవరీని చేపట్టినట్టుగా వివరించారు. పెరుగుతోన్న దేశ వృద్ధి రేటు, ఎన్సీఎల్టీలో దివాలా రుణాల పరిష్కారం వేగవంతం కావడం తదితర అనుకూలతల నేపథ్యంలో బ్యాక్ దాదాపు 8-10 శాతం వృద్ధిని నమోదు చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్బీఎల్సీ ద్వారా జారీ చేసిన రుణాల్లో మరో రూ.500 కోట్లు బ్యాంకునకు తిరిగి రావాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ నెలల తమ బ్యాంక్ ఈ మొత్తాన్ని రాబట్టగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్బీఐ గుర్తించిన డజను భారీ నిరర్థక ఆస్తులకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 11 ఖాతాలతో తమ బ్యాంక్నకు సంబంధం ఉన్నట్టుగా ఆయన వివరించారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.8,300 కోట్ల వరకు ఉంటుందని అన్నారు.