Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో కూడిన నాలుగు స్మార్ట్ఫోన్లను భారత విపణిలోకి తీసుకువచ్చింది. మిడ్ రేంజ్లో ఈ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పెద్ద స్క్రీన్తో కూడిన ఫోన్ల హవా నడుస్తుండటంతో ఇన్ఫినెట్ డిస్ప్లే పేరుతో గెలాక్సీ జె6, జె8, ఏ6, ఏ6+ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు 18:9 యాస్పెక్ట్ రేషియోతో సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేతో రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది. అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సహాయంతో ఇవి కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందించనున్నట్టుగా శాంసంగ్ మొబైల్ బిజనెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ6 ఫోన్లు ఎగ్జిమస్ 7 సీరిస్ ప్రాసెసర్, 5.6 అంగుళాల సూపర్ ఆమోలెడ్ తెరతోను, ముందు వెనుక 16 ఎంపీ కెమేరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ దీనిని రూపొందించింది. వీటి ధరను కంపెనీ రూ.21,990 (32జీబీ)/ 22,990 (64జీబీ)గా నిర్ణయించింది. గెలాక్సీ ఏ6+ ఫోన్లను శాంసంగ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6 అంగుళాల ఎఫ్హెచ్డీ సూపర్ ఆమోలెడ్ తెరతోను, ముందు 16 ఎంపీ కెమేరా, వెనుక 5 ఎంపీల కెమేరాతోను, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ దీనిని రూపొం దించింది. వీటి ధరను కంపెనీ రూ. 25,990గా నిర్ణయించింది. గెలాక్సీ జె6 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమొరీతో రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర వరుసగా ధర రూ.13,990, రూ.16,490గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక గెలాక్సీ జె8 4జీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమొరీతో రానుంది. ఈ నాలుగు ఫోన్లూ ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో పనిచేస్తాయి. జె6లో శాంసంగ్కు చెందిన ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్ను వినియోగించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. గెలాక్సీ జె6 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్తో వస్తోంది.