Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 83 వేల కోట్లు తీర్చిన 2,100 కంపెనీలు
న్యూఢిల్లీ : కార్పొరేట్ల నుంచి మొండి బకాయిల రాబ ట్టేందుకు దివాళా చట్టం(ఐబీసీ) లో చేసిన సవరణలు ఫలితాలి స్తున్నట్టు తెలుస్తున్నది. ఐబీసీలో సవరణలు చేస్తూ కేంద్రం ఇటీ వల ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్పొ రేట్ సంస్థలు.. బ్యాంకులను బకాయిలు చెల్లించే పక్రియను వేగవంతం చేశాయి. దీంతో ఇప్పటివరకు దాదాపు 2,100 బడా కంపెనీలు.. బ్యాంకులు, విక్రేతలకు బాకీ ఉన్న రూ.83 వేల కోట్లను తీర్చాయి. కేంద్రప్రభుత్వ గణాంకాలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవాల్సి వస్తుందన్న భయంతోనే ప్రమోటర్లు బకాయిలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బాకీలు తీర్చితేనే ప్రమోటర్లు వారి కంపెనీల బిడ్డింగ్లో పాల్గొనేలా దివాళా చట్టానికి సవరణ తీసుకొచ్చారు. అంతే కాక.. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. 90 రోజుల్లోగా కంపె నీలు, సంస్థలు తమ బకాయిలు చెల్లించకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు గా పరిగణించే అవకాశముంది.