Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయినా జెట్ ఎయిర్వేస్ ఇండియా ఫలితాలకు ఇంధన ధరల సెగ తాకింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలు భారీగా పెరగడంతో ఈ కంపెనీ పెద్ద మొత్తంలో నష్టాలు చవి చూసింది. 2017-18 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.1036 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.602 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ4లో నిర్వహణ రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.5925 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఇంధన ధరలు 31 శాతం ఎగిసి రూ.2063 కోట్లుగా చోటు చేసుకున్నాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపుగా 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే ఉంటాయి. బుధవారం బిఎస్ఇలో జెట్ ఎయిర్వేస్ షేర్ 0.23 శాతం పెరిగి రూ.421.15 వద్ద ముగిసింది.