Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న ఇంధన ధరల విధానం భారత ఆర్ధిక వ్యవస్థపై పెను భారాన్ని మోపనుంది. ప్రజల కనీస అవసరాల నుంచి విమానయానం వరకూ ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు కేంద్రం ప్రత్యామ్నా యాలను చేపట్టకుండా దేశంలో పెట్రో, డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఈ ప్రభావం విమానాలకు ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలపైనా పడనుందని విశ్లేషకులు పేర్కొంటు న్నారు. గత కొద్ది నెలల్లోనే ఎటిఎఫ్ ధరలు 30 శాతం పెరగడంతో విమాన యాన సంస్థలు నిర్వహణ ఖర్చులను అధిగమించేందుకు విమాన చార్జీలను పెంచవచ్చని ఈ రంగం మార్కెట్ వర్గాల్లో వినికిడి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే ఉంటాయి. దీంతో త్వరలోనే విమాన చార్జీలను 15 శాతం మేర పెరుగొచ్చని ఆ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంధన ధరల పెరుగుదలతో చార్జీలు పెంచక తప్పదని ఇప్పటికే పలు ప్రైవేట్ విమానయాన సంస్థలు సంకే తాలిచ్చాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే పెంచినప్పటికీ అధికారికంగా చార్జీల పెంపును ప్రకటించకపోవడం గమ నార్హం. జెట్ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు 10 నుంచి 15 శాతం పెరగొచ్చని తాము అంచనా వేస్తున్నా మని కెపిఎంజి ఏరోస్సేస్, డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొ న్నారు. గతేడాదిగా జెట్ ఇంధన ధరలు 30 శాతం మేర పెరిగాయని, క్రితం ఆరునెలల్లోనే 25 శాతం భారమయ్యా యని ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలను పెంచకతప్పదని స్పష్టం చేశారు. అయితే ముందుగా ఏ సంస్థ చార్జీల పెంపును ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జెట్ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని ఆ వర్గాలు ఆశిస్తున్నాయి.