Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయంగా అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో టీసీఎస్ షేరు రూ.3674 ఆల్ టైం గరిష్టాన్ని చేరడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 7.01 లక్షల కోట్లను చేరువైంది. మార్కెట్ క్యాప్ విషయంలో ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా టీసీఎస్ రికార్డును నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 నుంచి టీసీఎస్ షేర్లు 16 శాతం దూసుకెళ్లాయి. మరోవైపు రిలయన్స్ ఇండిస్టీస్ దాదాపు 5.81 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో రెండవ స్థానంలో నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ పెరగడానికి ఇటీవల ఆ సంస్థ మార్చి త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రతిపాదించడం కూడా సానుకూలం అంశమని వారు చెబుతున్నారు.